Breaking News

అజిత్ పేరుతో తప్పుడు ప్రచారం.. అసలు నిజం బయటపెట్టిన ప్రతినిధులు

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): తమిళ సినీ నటుడు అజిత్ కుమార్ ఓటు వేసిన అనంతరం ఆయన పేరుతో ప్రచారంలోకి వచ్చిన వ్యాఖ్యలు అసత్యమని స్పష్టమైంది. ప్రభుత్వ మార్పుపై అజిత్ స్పందించారనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో గందరగోళం నెలకొంది.ఎన్నికల రోజు ఉదయం పోలింగ్ కేంద్రానికి వెళ్లిన అజిత్ నిశ్శబ్దంగా ఓటు హక్కును వినియోగించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. విలేకరులతో ఎలాంటి సంభాషణ జరగలేదని సమాచారం.అయితే, “ప్రభుత్వ మార్పు అవసరం లేదు” అంటూ అజిత్ వ్యాఖ్యానించారనే తప్పుడు ప్రచారం తర్వాత పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ప్రతినిధులు స్పందిస్తూ ఆ వార్తలను పూర్తిగా ఖండించారు.అజిత్ ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయలేదని, ఆయన పేరును ఉపయోగించి తప్పుదారి పట్టించే ప్రచారం జరుగుతోందని తెలిపారు. బాధ్యతగల పౌరుడిగా ఓటు వేయడం మాత్రమే ఆయన చేసిన పని అని స్పష్టం చేశారు.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?

చిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *