Breaking News

రాష్ట్రంలో త్వరలో అన్ని ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు: ముఖ్యమంత్రి

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఆర్టీసీలో అన్ని బస్సులను ఏసీ ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తామని తెలిపారు. సామాన్యులు కూడా గౌరవంగా ప్రయాణించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.డబ్బులు ఉన్నవారే కాకుండా పేదలు కూడా ఏసీ సౌకర్యంతో ప్రయాణించేలా చూడడం తన లక్ష్యమని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రజలకు సౌకర్యవంతమైన, ఆధునిక రవాణా వ్యవస్థను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఐదు వేల విద్యుత్‌ ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం పెరగడంతో కాలుష్యం తగ్గడంతో పాటు ఇంధన వ్యయం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు.కూటమి పాలనలో భారీగా పెట్టుబడులు వచ్చాయని, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కలిగాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని అన్నారు.

నాదెండ్ల మనోహర్‌ను ఫోన్‌లో పరామర్శించిన పవన్ కళ్యాణ్

రవాణా రంగంలో ప్రజలకు నాణ్యమైన సేవల దిశగా మరో అడుగు: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *