Breaking News

The result of difficulty is staggering

కష్టానికి ఫలితం చిరస్థాయిగా ఉంటుంది

కష్టానికి ఫలితం చిరస్థాయిగా ఉంటుంది: నారా భువనేశ్వరి

కుప్పం: యువతే దేశ భవిష్యత్తుకు నాయకులు అని, కష్టపడితే విజయాన్ని సాధించవచ్చని నారా భువనేశ్వరి అన్నారు.

రెండోరోజు కుప్పం పర్యటనలో భాగంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ఆమె ముఖాముఖి నిర్వహించారు. కార్యక్రమానికి ముందు కళాశాల ప్రాంగణంలో భువనేశ్వరి మొక్కలు నాటారు.

అమరావతికి రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్.. నారా లోకేశ్ భావోద్వేగ స్పందన

ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ, మహిళలు ఐటీ రంగంలో రాణిస్తున్నారని, ఇది గొప్ప పరిణామమని అభిప్రాయపడ్డారు. విజన్‌తో ముందుకు సాగితే అద్భుతాలను సాధించవచ్చని తెలిపారు. ప్రజల కోసం నిరంతరం శ్రమించే చంద్రబాబు తనకు స్ఫూర్తి అని అన్నారు.

విద్యార్థులకు పిలుపు
తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేస్తారని, వారి ఆశయాలను నెరవేర్చడం విద్యార్థుల బాధ్యత అని పేర్కొన్నారు. ఒకప్పుడు మహిళలు కేవలం ఇంటికే పరిమితమయ్యారని, కానీ ఇప్పుడు అన్ని రంగాల్లోనూ మహిళలు ముందున్నారని చెప్పారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర విశేషమని భువనేశ్వరి హర్షం వ్యక్తం చేశారు.

సందేశం
కష్టపడి సాధించిన విజయం మాత్రమే నిలకడగా ఉంటుందని, యువత తమ లక్ష్యాలను సాధించడానికి నిరంతరం ప్రయత్నించాలని నారా భువనేశ్వరి సూచించారు.

అమరావతి ఏకైక రాజధాని.. గెజిట్‌తో అధికారిక ముద్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *