రాష్ట్రంలో భూ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు!
అమరావతి:
రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామాల్లో భూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. ఈ నిర్ణయంతో భూముల విలువలో సుమారు 15% పెరుగుదల ఉండే అవకాశముంది.
జిల్లా కలెక్టర్ల ప్రతిపాదనలను కమిటీలు ఆమోదించగా, ఈ నెల 20న సబ్-రిజిస్ట్రార్ ఆఫీసుల్లో నోటీసు బోర్డుల్లో సవరణల వివరాలు ప్రదర్శించనున్నారు.
అభ్యంతరాల స్వీకరణ
సవరణలపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలను ఈ నెల 24 వరకు స్వీకరించనున్నారు. 27వ తేదీన అందిన సూచనలు, అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు.
కొత్త ఛార్జీల అమలు
నూతన సంవత్సరం ప్రారంభం నుంచే ఈ కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నట్లు అధికారులు తెలిపారు.
