ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఇటీవల కన్నుమూసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు.భాస్కర్రావు చిత్రపటానికి పూలమాల వేసి గౌరవం తెలిపారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను కలసి పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా భాస్కర్రావు రాజకీయ సేవలను కేటీఆర్ స్మరించుకున్నారు.
