జైపూర్లో ఘోర అగ్నిప్రమాదం: ఐదుగురు మృతి
రాజస్థాన్లోని జైపూర్ నగరంలోని భాంక్రోటా ప్రాంతంలో హైవేపై ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఎల్పీజీ ట్యాంకర్ను ట్రక్ ఢీకొట్టడంతో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న పెట్రోల్ బంక్కి వ్యాపించాయి. దీంతో మంటలు విపరీతంగా ఎగిసిపడ్డాయి.
ఈ ప్రమాదంలో 24 మంది తీవ్రంగా గాయపడినట్టు అధికారులు తెలిపారు. అలాగే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని, ప్రమాద తీవ్రతకు సంబంధించి చనిపోయిన వారి శరీరాలు గుర్తుపట్టడానికి వీల్లేనంతగా కాలిపోయాయని అధికారులు వెల్లడించారు.
