హనుమాన్ జంక్షన్ ఏప్రిల్ 25(నేటి తెలుగు పత్రిక ): కానుమోలు గ్రామం లో ఇంటి పన్నులను 100% వసూలు చేసినందుకు గ్రామాన్ని చెత్త రహితంగా తీర్చిదిచ్చిన గ్రామ పంచాయతీ కార్యదర్శి బొమ్మసాని సుభాష్ కుమార్ కి ఉత్తమ ఉద్యోగిగా రాష్ట్ర ఎక్సైజ్ అండ్ గనుల శాఖమంత్రి వర్యులు కొల్లు రవీంద్ర, జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ జాయింట్ కలక్టర్ నవీన్ చేతులమీదుగా శుక్రవారం అవార్డు అందుకున్నారు. జాతీయపంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో జిల్లా పంచాయతీ అధికారిని డాక్టర్ జె. అరుణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తనకి అవార్డు ఇచ్చినట్లు చెప్పారు. అవార్డు రావాడానికీ సహకరించిన తోటి ఉద్యోగులకు, గ్రామ ప్రజలకు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. బొమ్మసానికి అభినందనలు తెలిపిన కోపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ దన్నే దుర్గారావుమాజీ సర్పంచ్ చింతల వెంకట శివ అప్పారావు మరియు పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు.
