ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత మునీరాబాద్ సభలో ‘పాంచజన్యం’ పేరుతో ఐదు ప్రధాన హామీలను ప్రకటించారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యమని తెలిపారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఉచిత విద్య అందిస్తామని చెప్పారు. విద్య ఖర్చులు తగ్గించడమే లక్ష్యమన్నారు.ఆరోగ్య రంగంలో కూడా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. వైద్య ఖర్చుల భారాన్ని తగ్గిస్తామని తెలిపారు. వ్యవసాయ రంగంపై దృష్టి సారిస్తూ రైతును రాజుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రైతుల సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు.మిగిలిన హామీల వివరాలను త్వరలో ప్రకటిస్తామని కవిత తెలిపారు.
