Breaking News

మే 1 నుంచి భూముల ధరల పెంపు.. మార్కెట్ విలువల సవరణకు ప్రభుత్వం సిద్ధం

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో స్థిరాస్తి రంగంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భూములు, నివాస మరియు వాణిజ్య ఆస్తుల మార్కెట్ విలువలను సవరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు నేతృత్వంలో జరిగిన కేబినెట్ ఉపసంఘం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.మే మొదటి వారంనుంచి కొత్త ధరలు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యవసాయ భూముల విలువలు ప్రాంతాన్ని బట్టి రెండింతలు నుంచి మూడింతలు పెరిగే అవకాశం ఉందని అంచనా. ప్రస్తుతం ఎకరాకు రూ.6 లక్షలు ఉన్న భూమి ధర, సవరణ తర్వాత రూ.12 నుంచి రూ.18 లక్షల వరకు చేరవచ్చని అధికారులు భావిస్తున్నారు.హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, ముఖ్యంగా Outer Ring Road పరిధిలో భూముల విలువలను గణనీయంగా పెంచే అవకాశముంది. అలాగే Regional Ring Road, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టుల ప్రభావంతో డిమాండ్ పెరిగిన ప్రాంతాల్లో ధరలు మరింత పెరగనున్నాయి.ఖాళీ ప్లాట్లు, నివాస లేఅవుట్ల ధరలతో పాటు వాణిజ్య ఆస్తుల విలువలు కూడా పెరగనున్నాయి. ప్రభుత్వ విలువలు మరియు మార్కెట్ ధరల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంఇదే సమయంలో హిల్ట్ (HILT) పాలసీ అమలుపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. కాలుష్య కారక పరిశ్రమలను నగర పరిధి బయటకు తరలించి, పరిశ్రమల అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత సాధించాలని యోచిస్తోంది.కొత్త రేట్లు అమల్లోకి రానున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల ఖర్చు పెరగవచ్చని భావిస్తూ కొనుగోలుదారులు ముందుగానే లావాదేవీలు పూర్తి చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

మంత్రి పేరుతో మోసం.. కోట్ల రూపాయలు వసూలు చేసిన వ్యక్తిపై కేసు

ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణ స్వీకారం.. కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *