ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదురుతోంది. టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత, మాజీ సీఎం కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇటీవల జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన కవిత, “గతంలో కార్మికులు ఇబ్బందులు పడుతున్న సమయంలో కేసీఆర్ స్పందించిన తీరు ఇప్పుడు కనిపించడం లేదు” అంటూ వ్యాఖ్యానించారు. ఆయనలో పెద్ద మార్పు వచ్చిందని, ప్రజల సమస్యల పట్ల స్పందన తగ్గిందని విమర్శించారు.“ఏ కష్టం వచ్చినా ముందుండే నాయకత్వం ఇప్పుడు కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన ప్రజలకు దగ్గరగా లేరని అనిపిస్తోంది” అంటూ కవిత వ్యాఖ్యానించారు. అలాగే పార్టీ అంతర్గత పరిస్థితులపైనా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలపై అసహనం వ్యక్తం చేస్తూ, పార్టీ దిశలో మార్పు అవసరమని సూచించారు. తాజా వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో చర్చ మరింత వేడెక్కింది.కవిత వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్గాలు ఎలా స్పందిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
