Breaking News

అర్ధరాత్రి విధుల్లో మార్పులు.. ఎక్సైజ్ సిబ్బందికి ఊరట

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉపశమనం కల్పించింది. బార్‌లు మూసివేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఫోటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సిన నిబంధనలో సడలింపులు ప్రకటించింది.విశాఖపట్నంలో జరిగిన విషాద ఘటన ఈ నిర్ణయానికి దారితీసింది. సీతమ్మధార ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సింహాచలం నాయుడు విధి నిర్వహణలో భాగంగా రాత్రివేళ బార్‌ల తనిఖీలు పూర్తి చేసి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. తాటిచెట్లపాలెం వద్ద మద్యం మత్తులో ఉన్న యువకులు నడిపిన బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ సంఘటనతో ఎక్సైజ్ సిబ్బంది భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో విధులు నిర్వహించడం సిబ్బందికి ప్రమాదకరంగా మారుతున్నదని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాయి.ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి, రాత్రి వేళల్లో ఫోటోలు తీసి అప్‌లోడ్ చేయాల్సిన నిబంధనను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ మార్పులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.ఈ నిర్ణయంతో ఎక్సైజ్ పోలీసులకు కొంత ఉపశమనం లభించనుంది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *