ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ లీసా గిల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తొలి మహిళా చీఫ్ జస్టిస్గా నియామకమవుతున్నందుకు ఆమెకు అభినందనలు తెలిపారు.రాష్ట్ర న్యాయవ్యవస్థలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా భావిస్తూ, మహిళా నాయకత్వానికి ఇది మంచి ఉదాహరణ అని సీఎం పేర్కొన్నారు. న్యాయపరమైన వ్యవస్థ మరింత బలపడాలని ఆకాంక్షించారు.ఇవాళ సాయంత్రం లోక్ భవన్లో జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
