Breaking News

దస్తగిరి హత్యపై మంత్రి ఫైర్.. నిందితులకు కఠిన హెచ్చరిక: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న పెద్ద దస్తగిరి హత్య కేసుపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ హత్య వెనుక ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ, ఈ ఘటన ఆయన కనుసన్నల్లోనే జరిగిందని విమర్శించారు.అమరావతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి, గతంలో జరిగిన వివేకానందరెడ్డి హత్యను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరిగాయని గుర్తు చేశారు. ఇదే విధంగా దస్తగిరి హత్య కేసును కూడా మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నేరాలకు సంబంధం ఉన్న నాయకులు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తమ స్వభావాన్ని మార్చుకోరని మంత్రి విమర్శించారు. అధికారాన్ని కోల్పోయినా ఇంకా కుట్రల రాజకీయాలు కొనసాగుతున్నాయని, తాడేపల్లి కేంద్రంగా కుట్రలు జరుగుతున్నాయని అన్నారు.దస్తగిరి హత్య కేసులో నిజాలు వెలుగులోకి రావాలని, నిందితులు ఎంత పెద్దవారైనా తప్పించుకోలేరని మంత్రి స్పష్టం చేశారు. కడప జిల్లాలో ఈ ఘటనతో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారిందని, ప్రజల్లో కూడా ఆందోళన నెలకొన్నదని తెలిపారు.అలాగే ఈ కేసులో సంబంధిత వ్యక్తులపై పూర్తి స్థాయి విచారణ జరిపి, న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు.

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక..!

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. తాగు, సాగు సమస్యలకు చెక్: మంత్రి నిమ్మల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *