ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి ప్రభుత్వం శుభవార్త
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇల్లు కట్టుకునే ఆర్థికంగా బలహీనవర్గాల ప్రజలకు శుభవార్త చెప్పింది. పట్టణాలు, నగరాల్లో 100 గజాల (2 సెంట్లు) స్థలంలో ఇల్లు నిర్మించుకునే వారికి ప్లాన్ అప్రూవల్ ప్రక్రియ నుంచి మినహాయింపు కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అంతే కాకుండా, 300 గజాల వరకు స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన అనుమతులను మరింత సులభతరం చేయనుంది. ఈ చర్యలు ప్రజల సమయం మరియు శ్రమను ఆదా చేస్తాయి.
ఇకపోతే, ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 4 లక్షలు ఆర్థిక సాయంగా అందించనుందని సమాచారం. ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాలకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది
