అల్లూరి జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడం కలకలం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా కొత్తవలస – కిరండూల్ రైలుమార్గంలో ట్రాక్పై బండరాళ్లు జారిపడటంతో ఈ ప్రమాదం జరిగింది.
విశాఖపట్నం నుంచి అరకు వెళ్తున్న గూడ్స్ రైలులో ఒక వాగన్ బొర్రా రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది.
ఈ ఘటనతో రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఘటన స్థలంలో రైల్వే అధికారులు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నారు. త్వరలోనే రైలు సర్వీసులు సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
