Breaking News

Derailed Goods Train

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

అల్లూరి జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

ఆంధ్రప్రదేశ్‌ అల్లూరి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడం కలకలం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా కొత్తవలస – కిరండూల్‌ రైలుమార్గంలో ట్రాక్‌పై బండరాళ్లు జారిపడటంతో ఈ ప్రమాదం జరిగింది.

రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ కీలక భేటీ

విశాఖపట్నం నుంచి అరకు వెళ్తున్న గూడ్స్ రైలులో ఒక వాగన్‌ బొర్రా రైల్వే స్టేషన్‌ సమీపంలో పట్టాలు తప్పింది.

ఈ ఘటనతో రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అమరావతికి రాజముద్ర.. ఆంధ్రుల కల నెరవేర్చిన చారిత్రాత్మక నిర్ణయం

ఘటన స్థలంలో రైల్వే అధికారులు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నారు. త్వరలోనే రైలు సర్వీసులు సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *