ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక గుర్తింపు పొందారు. ప్రముఖ ఆర్థిక దినపత్రిక ఎకనామిక్ టైమ్స్ ప్రదానం చేసే ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్–2025’ అవార్డును ఆయన అందుకున్నారు.ముంబైలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్ ఫర్ కార్పొరేట్ ఎక్సలెన్స్ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు, విధాన నిర్ణేతలు హాజరయ్యారు.పరిపాలనలో చేపట్టిన సంస్కరణలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడం, వేగవంతమైన పాలన విధానాలు ఈ అవార్డు సాధనకు కారణమయ్యాయి. ముఖ్యంగా ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’, ‘స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్’ వంటి విధానాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడ్డాయి.రాష్ట్రంలో భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం విజయవంతమైందని, పరిశ్రమల స్థాపన, ఉద్యోగావకాశాల సృష్టిలో పురోగతి సాధించిందని నిపుణులు పేర్కొంటున్నారు.ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబును అభినందిస్తూ, ఈ అవార్డు రాష్ట్రానికి గర్వకారణమని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్న నాయకత్వానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.
