విద్యా ప్రమాణాల మెరుగుకై మెగా పేరెంట్ – టీచర్ మీట్
•ముఖ్యమంత్రి, హెచ్.ఆర్.డి. మంత్రి బాపట్ల మున్సిఫల్ హై స్కూల్ లో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు
•మౌలిక వసతులు విద్యా ఫలితాల ఆధారంగా పాఠశాలలకు స్టార్ రేటింగ్
రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కోన శశిథర్
అమరావతి, డిశంబరు 4: తల్లిదండ్రుల సహకారం, భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకే సారి ఈ నెల 7 వ తేదీన మెగా పేరెంట్ – టీచర్ మీట్ ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కోన శశిథర్ తెలిపారు. బాపట్ల మున్సిఫల్ హై స్కూల్ లో జరిగే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ హాజరు అవుతారన్నారు.
