Breaking News

తాడిపత్రిలో హిజ్రా మల్లిక హత్య కలకలం.. ముగ్గురు అరెస్ట్

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): తాడిపత్రి పట్టణంలో హిజ్రా మల్లిక హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. రైలు పట్టాలపై ఆమె మృతదేహం కనిపించడంతో ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. మొదట అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు, అనంతరం లభించిన ఆధారాల ఆధారంగా హత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.పోలీసుల వివరాల ప్రకారం, మల్లిక ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆమెను కొందరు వ్యక్తులు బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలు ఈ కేసులో కీలకంగా మారాయి.తరువాత చల్లవారిపల్లి రైల్వే గేట్ సమీపంలో రైలు పట్టాలపై మల్లిక మృతదేహం కనిపించడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. శవం పరిస్థితి ఆధారంగా ఇది హత్యేనని భావించి కేసును నమోదు చేశారు.మల్లిక మృతిపై తోటి హిజ్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రత్యర్థి వర్గంపై ఆరోపణలు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొనడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మరికొందరి ప్రమేయం ఉన్నదేమో అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

పెట్రోల్, డీజిల్ సరఫరాలో తాత్కాలిక అంత రాయాలు ఉన్నప్పటికీ రవాణా సేవలు ఆగకూడదు.

ట్రాన్స్‌జెండర్‌కు పీఏగా అవకాశం.. ఎమ్మెల్యే గళ్లా మాధవి నిర్ణయం ప్రశంసలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *