Breaking News

CM Revanth knows that there is no strength in the ACB case

ఫార్ములా-ఈ వివాదం కేటీఆర్‌ తీవ్ర విమర్శలు

హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ వివాదం: కేటీఆర్‌ తీవ్ర విమర్శలు

హైదరాబాద్‌ ఫార్ములా-ఈ రేస్‌ వివాదంలో తనపై లేవనెత్తిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, తనపై పెట్టిన ఏసీబీ కేసు రాజకీయ కుట్రలో భాగమని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు.

“అవినీతి లేని చోట కేసు ఎలా?”
“ఫార్ములా-ఈ రేస్‌ నిర్వహణలో ఎలాంటి అవినీతి జరగలేదు. ప్రభుత్వం అవినీతి, కుంభకోణాలపై నేను ఎత్తిన ప్రశ్నల కారణంగా నాపై రాజకీయ వేధింపులు చేస్తున్నది. మేము ఉద్యమకారులం, ప్రజా సమస్యల కోసం పోరాడుతాం. ఏ కుట్రలు చేసినా భయపడేది లేదు,” అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

ఫార్ములా-ఈ రేసు నిర్వహణ:
ప్రపంచ పటంలో హైదరాబాద్‌ పేరును ప్రాచుర్యం పొందేలా విద్యుత్‌ వాహన సంస్థలను ఆకర్షించడమే లక్ష్యమని, 2022లో తొలిసారి రేసును విజయవంతంగా నిర్వహించామని కేటీఆర్‌ తెలిపారు.

  • తెలంగాణ ప్రభుత్వం రూ.30 కోట్లు ఖర్చు చేయగా, ప్రైవేట్‌ స్పాన్సర్లు రూ.110 కోట్లు పెట్టుబడిగా పెట్టారు.
  • తొలి రేసు అనంతరం హైదరాబాద్‌ ఆర్థిక వ్యవస్థకు రూ.700 కోట్ల లాభం వచ్చిందని నీల్సన్‌ సంస్థ వెల్లడించిందని చెప్పారు.

రాజకీయ కుట్రలు, ప్రభుత్వం నిర్లక్ష్యం:
తదుపరి రేసులకు చెల్లింపులు చేయాలంటూ ఫార్ములా-ఈ సంస్థ లేఖలు రాశాయని, కానీ కొత్త కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒప్పందాలను గౌరవించకపోవడంతో రేసులు నిలిచిపోయాయని కేటీఆర్‌ ఆరోపించారు.

  • అంతర్జాతీయ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో ఫార్ములా-ఈ సంస్థ కేసు పెట్టిందని వివరించారు.
  • నిధుల చెల్లింపు పూర్తిగా పారదర్శకంగా జరిగిందని, ఆరోపణలు సబబుకాదని స్పష్టంచేశారు.

“తెలంగాణ ప్రజలు నిజం తెలుసుకోవాలి”: కేటీఆర్‌
రాజకీయ కక్ష సాధింపుల కారణంగా తనపై కేసులు పెట్టారని కేటీఆర్‌ మండిపడ్డారు.
“ప్రస్తుత అసెంబ్లీలోనే చర్చకు రమ్మని సవాలు విసురుతున్నా. నిజానిజాలు తెలుగుదేశం ప్రజలకు చెప్పాలని కోరుతున్నా,” అని అన్నారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

తెలంగాణ భవన్లో రైతులతో సమావేశమైన కేటీఆర్‌, “మన జైత్రయాత్ర కొడంగల్‌ నుంచే ప్రారంభం కావాలి” అని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *