Breaking News

విశాఖకు చేరుకున్న మంత్రి నారా లోకేష్.. ఘన స్వాగతం

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. యువత ప్లకార్డులు చేతబూని ఉత్సాహంగా ఆహ్వానం తెలిపింది.టీడీపీ నేత చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో “జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్ (వైజాగ్)” అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ లోకేష్‌కు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. మంత్రి ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ అభిమానుల ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో జరుగనున్న శతాబ్ది ఉత్సవాల్లో మంత్రి పాల్గొననున్నారు. ఈ వేడుకలకు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సీఎం నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఉత్సవాలకు విచ్చేసే అతిథులకు సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి లోకేష్ స్వాగతం పలకనున్నారు. అనంతరం రాత్రి నోవాటెల్ హోటల్‌లో Google ప్రతినిధుల గౌరవార్థం ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొననున్నారు.

గూగుల్ డేటా సెంటర్‌తో విశాఖకు నూతన దిశ: ఎమ్మెల్సీ అనురాధ

విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. కీలక నిర్ణయాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *