Breaking News

అసెంబ్లీ ప్రాంగణం పార్లమెంట్‌ తరహాలో ఉండాలి: సీఎం రేవంత్‌రెడ్డి

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): అసెంబ్లీ ప్రాంగణ అభివృద్ధిపై జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. శాసనసభ ప్రాంగణం పార్లమెంట్‌ తరహాలో ఉండేలా రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించారు.సభ గౌరవం పెరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని, సభ్యులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు మరింత ప్రైవసీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పబ్లిక్ గార్డెన్‌లో సభ్యుల కోసం ప్రత్యేకంగా క్లబ్ ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు.అలాగే వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి సెంట్రల్ హాల్ సిద్ధంగా ఉండేలా పనులను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. సమగ్ర ప్రణాళికతో అసెంబ్లీ ప్రాంగణాన్ని ఆధునికంగా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు.

కేసీఆర్‌పై సీఎం రేవంత్ వ్యాఖ్యలు.. ‘ప్రత్యర్థి మాత్రమే, శత్రువు కాదు’

కొత్త పార్టీ అవసరమా?.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *