ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): అసెంబ్లీ ప్రాంగణ అభివృద్ధిపై జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. శాసనసభ ప్రాంగణం పార్లమెంట్ తరహాలో ఉండేలా రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించారు.సభ గౌరవం పెరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని, సభ్యులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు మరింత ప్రైవసీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పబ్లిక్ గార్డెన్లో సభ్యుల కోసం ప్రత్యేకంగా క్లబ్ ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు.అలాగే వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి సెంట్రల్ హాల్ సిద్ధంగా ఉండేలా పనులను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. సమగ్ర ప్రణాళికతో అసెంబ్లీ ప్రాంగణాన్ని ఆధునికంగా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు.
