ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): విద్యుత్ రంగంపై సమీక్ష నిర్వహించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు పలు కీలక సూచనలు చేశారు. విద్యుత్ కొనుగోలు చార్జీలను యూనిట్కు రూ.4.60కు తగ్గించే దిశగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.రాష్ట్రంలో రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారించాలని సూచించిన సీఎం, ఇంధన రంగంలో పరిశోధనలకు ప్రోత్సాహం ఇవ్వడానికి ప్రత్యేకంగా ఎనర్జీ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచనను వెల్లడించారు.అలాగే ఈవీ వాహనాల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రభుత్వ పథకాల అమలులో టెక్నాలజీ వినియోగాన్ని మరింత విస్తరించాలని అధికారులకు సూచించారు.ప్రస్తుత ఏడాదిలో విద్యుత్ వినియోగం 14 శాతం పెరిగిందని పేర్కొన్న సీఎం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని ఆదేశించారు.
