ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): సిక్కిం రాష్ట్ర స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రత్యేక శైలితో అందరినీ ఆకట్టుకున్నారు. సిక్కిం పర్యటనలో భాగంగా గాంగ్టక్లో యువకులతో కలిసి ఫుట్బాల్ ఆడుతూ ఉత్సాహంగా గడిపారు. సాధారణంగా కుర్తా-పైజామాలో కనిపించే ప్రధాని, ఈసారి ట్రాక్ ప్యాంట్, స్పోర్ట్స్ టీ-షర్ట్, ఫుట్బాల్ స్పైక్స్ ధరించి మైదానంలోకి దిగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యువ మిత్రులతో కలిసి ఆటపాటల్లో పాల్గొన్న ఆయన, ఆ అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.ఈ పర్యటనలో భాగంగా ప్రధాని సిక్కిం అభివృద్ధికి కీలకమైన పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. సుమారు రూ.4,000 కోట్ల వ్యయంతో మౌలిక వసతులు, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, వ్యవసాయ రంగాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అలాగే గాంగ్టక్లో నిర్వహించిన రోడ్షోలో ప్రజలు భారీగా తరలి వచ్చి ప్రధానికి ఘన స్వాగతం పలికారు. సిక్కిం రాష్ట్రం ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన ఈ పర్యటన రాష్ట్ర అభివృద్ధికి కొత్త ఊపునిచ్చేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
