|| End of day for Assembly and Council Meetings ||
హైదరాబాద్: ఈనెల 9న ప్రారంభమైన అసెంబ్లీ, మండలి సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. 16న తిరిగి ప్రారంభమైన ఈ సమావేశాలు నేటితో ముగిసే అవకాశం ఉంది.
ఈరోజు అసెంబ్లీ, శాసన మండలిలో రైతు భరోసా పథకంపై ముఖ్య చర్చ జరుగనుంది. చర్చ అనంతరం మంత్రివర్గం విధి విధానాలను ఖరారు చేయనుంది. సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో పథకానికి సంబంధించిన డబ్బులు జమ చేయనున్నట్లు సమాచారం.
ఈ సమావేశాలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై కీలక చర్చలకు వేదిక అయ్యాయి.
