Breaking News

లోక్‌సభలో బీఆర్ఎస్ లేని లోటు స్పష్టంగా కనిపించింది: కేసీఆర్

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): కే. చంద్రశేఖర్ రావు లోక్‌సభలో తాజా పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో బీఆర్ఎస్ సభ్యులు లేకపోవడం వల్ల తెలంగాణ స్వరం వినిపించలేకపోయిందని అన్నారు.ఈ సందర్భంగా తేజస్వి సూర్య వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఆయన చేసిన వ్యాఖ్యలకు ఎవరూ అడ్డుపడకపోవడం బాధాకరమని విమర్శించారు. బీఆర్ఎస్ ఎంపీలు సభలో ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదని, తెలంగాణ అంశంపై గట్టిగా స్పందించి ఉండేవారని తెలిపారు.ప్రస్తుత ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడటం లేదని ఆవేదన వ్యక్తం చేసిన కేసీఆర్, తెలంగాణ పట్ల నిజమైన నిబద్ధత బీఆర్ఎస్‌కే ఉందన్నారు. గతంలో అనేక సందర్భాల్లో తాను మానసిక క్షోభను ఎదుర్కొన్నప్పటికీ, తెలంగాణ కోసం పోరాటాన్ని ఆపలేదని గుర్తు చేశారు.హైదరాబాద్‌ను కలుపుకుని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి జరిగిన ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ, అప్పట్లో ఎంతో కఠిన పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గకుండా పోరాడామని చెప్పారు. తెలంగాణ సాధనలో బీఆర్ఎస్ పాత్రను మరెవరూ మరవలేరని ఆయన పేర్కొన్నారు.

కేసీఆర్ భాషపై మల్లు రవి ఆగ్రహం.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్

తెలంగాణలో ఇంధన కొరత లేదంటూ స్పష్టం.. ప్రజలకు ఆందోళన అవసరం లేదన్న కమిషనర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *