విజయవాడ, ఏప్రిల్ 28, సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని వెంట నే తేవాలని ఏపీయూడ బ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా వి.కోట ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డి ని అత్యంత కిరాతకంగా హత్య చేయడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వి.కోట ఆంధ్రజ్యో తి విలేఖరి జగన్మోహన్ రెడ్డి ని మంగళవారం ఉద యం రౌడీషీటర్ మరికొందరితో కలిసి హత్య చేయడాన్ని నిరసిస్తూ ఏపీయూ డబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు విజయవా డ ప్రెస్ క్లబ్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చావా రవి మాట్లాడుతూ శ్రీ గంధం మాఫియా పై వరుస కథనాలు రాయ డాన్ని జీర్ణించుకోలేని వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి ని హత్య చేశారన్నారు. ఉదయం వాకింగ్ కి వెళ్లి వస్తున్న వ్యక్తిని అందరూ చూస్తుండగానే హత్య చేయడం నేరస్తుల తెగిం పునకు అద్దం పడుతోంది అన్నారు. ఇలాంటి వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతోపాటు వెనకున్న శక్తుల పాత్ర పై కూడా విచారణ జరపాల ని డిమాండ్ చేశారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు జర్నలిస్టుల రక్షణ చట్టం తక్షణమే తే వాల్సిన అవసరంఉందని అభిప్రాయపడ్డారు. ఐ.జె.యు కౌన్సిల్ సభ్యులు ఎస్. కె బాబు మాట్లాడుతూ ఇలాంటి దాడుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి అన్నారు అనేక సందర్భాల్లో ఐజే యూ, ఏపీయూడబ్ల్యూజే డిమాండ్ చేసినట్లు జర్న లిస్టు రక్షణ చట్టాన్ని అమ లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూ డబ్ల్యూజే విజయవాడ యూనిట్ కార్యదర్శి దారం వెంకటే శ్వరరావు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, ఫోటో జర్న లిస్ట్స్ అసోసి యేషన్ నాయకులు నారాయణ, సాంబశివ రావు, ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ నాయకులు శ్రీనివాస్ కుమార్, రఘురాం, యం.వి సుబ్బారావు, ఆకుల తిరుమలరావు, ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్ ఉదయ్ భాస్కర్, పలువు రు జర్నలిస్టులు పాల్గొన్నారు.
