ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): విశాఖపట్నంలో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్, డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రెసిడెంట్ బెంజిమన్ లిన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖలో డెల్టా ఇన్నోవేషన్ మరియు ఆర్&డీ సెంటర్ను ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. ఈ సెంటర్ ద్వారా స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్ సాఫ్ట్వేర్, డేటా సెంటర్ ఆప్టిమైజేషన్, ఎనర్జీ స్టోరేజ్ మేనేజ్మెంట్ వంటి ఆధునిక సాంకేతికతలపై పరిశోధనలు జరగనున్నాయి. రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న డేటా సెంటర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని థర్మల్, పవర్ మేనేజ్మెంట్ మౌలిక వసతుల సరఫరా కోసం ప్రత్యేక తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని సూచించారు.అలాగే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) తయారీ, అసెంబ్లీ యూనిట్ను కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ కోరారు. ఈ యూనిట్లో బ్యాటరీ ర్యాక్స్, పవర్ కండిషనింగ్ సిస్టమ్స్ (PCS), ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ (EMS) తయారీ జరుగుతుంది.డెల్టా ఎలక్ట్రానిక్స్ సంస్థ పవర్ ఎలక్ట్రానిక్స్, ఆటోమేషన్, మొబిలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కంపెనీకి 51 ఫ్యాక్టరీలు, 73 ఆర్&డీ సెంటర్లు, 157 సేల్స్ ఆఫీసులు ఉన్నాయి.భారతదేశంలో కూడా డెల్టా ఎలక్ట్రానిక్స్ విస్తరణపై దృష్టి సారించింది. 2027 నాటికి సుమారు 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో తయారీ విస్తరణ, సరఫరా వ్యవస్థ బలోపేతం, సస్టైనబిలిటీ కార్యక్రమాలను చేపట్టాలని యోచిస్తోంది.
