బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

ప్రియాంకా గాంధీకి భాజపా ఎంపీ గిఫ్ట్

ప్రియాంకా గాంధీకి భాజపా ఎంపీ గిఫ్ట్

ప్రియాంకా గాంధీకి ‘1984’ అల్లర్లపై వినూత్న బహుమతి

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా చేసిన నిరసనలకు భారతీయ జనతా పార్టీ ఎంపీ అపరాజితా షడంగీ వినూత్న రీతిలో స్పందించారు. శుక్రవారం పార్లమెంట్ ఆవరణంలో ప్రియాంకా గాంధీకి అపరాజితా షడంగీ ఒక చేతిసంచీ బహుమతిగా అందించారు. ఆ సంచీపై ఎరుపు రంగులో “1984 అల్లర్లు” అని రాసి ఉంది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అపరాజితా షడంగీ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ వ్యాఖ్యలు జత చేశారు. “కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీకి బ్యాగులంటే ఎంతో ఇష్టం. అందుకే, 1984లో సిక్కుల ఊచకోతకు సంబంధించిన ఓ ప్రత్యేక సంచిని ఆమెకు బహుకరించాను. తొలుత ఆమె దాన్ని తీసుకోవడానికి నిరాకరించినప్పటికీ, ఆ తరువాత తీసుకొని పక్కన పెట్టేశారు” అని ఆమె రాసుకొచ్చారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

అపరాజితా షడంగీ మాట్లాడుతూ, “గత 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశం ఎదుర్కొన్న సమస్యలు, సిక్కులపై జరిగిన 1984 అల్లర్ల వంటి ఘటనలు నేటి తరానికి గుర్తు చేయాలని ఈ బహుమతి ద్వారా నాకు ఆసక్తి కలిగింది” అని తెలిపారు.

కాగా, పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ చేతిసంచులతో తన నిరసనను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఈ వినూత్న నిరసన ద్వారా జాతీయ, అంతర్జాతీయ అంశాలను ప్రతిబింబించాలని యత్నించారు.