Breaking News

Bjp MP Gift to Priyanka Gandhi

ప్రియాంకా గాంధీకి భాజపా ఎంపీ గిఫ్ట్

ప్రియాంకా గాంధీకి ‘1984’ అల్లర్లపై వినూత్న బహుమతి

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా చేసిన నిరసనలకు భారతీయ జనతా పార్టీ ఎంపీ అపరాజితా షడంగీ వినూత్న రీతిలో స్పందించారు. శుక్రవారం పార్లమెంట్ ఆవరణంలో ప్రియాంకా గాంధీకి అపరాజితా షడంగీ ఒక చేతిసంచీ బహుమతిగా అందించారు. ఆ సంచీపై ఎరుపు రంగులో “1984 అల్లర్లు” అని రాసి ఉంది.

ముత్తాత, నానమ్మలే వామపక్షాలను ఏమి చేయలేకపోయారు!

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అపరాజితా షడంగీ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ వ్యాఖ్యలు జత చేశారు. “కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీకి బ్యాగులంటే ఎంతో ఇష్టం. అందుకే, 1984లో సిక్కుల ఊచకోతకు సంబంధించిన ఓ ప్రత్యేక సంచిని ఆమెకు బహుకరించాను. తొలుత ఆమె దాన్ని తీసుకోవడానికి నిరాకరించినప్పటికీ, ఆ తరువాత తీసుకొని పక్కన పెట్టేశారు” అని ఆమె రాసుకొచ్చారు.

అపరాజితా షడంగీ మాట్లాడుతూ, “గత 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశం ఎదుర్కొన్న సమస్యలు, సిక్కులపై జరిగిన 1984 అల్లర్ల వంటి ఘటనలు నేటి తరానికి గుర్తు చేయాలని ఈ బహుమతి ద్వారా నాకు ఆసక్తి కలిగింది” అని తెలిపారు.

దేశంలో LPG కొరతలేదని కేంద్రం క్లారిటీ.. వదంతులకు చెక్

కాగా, పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ చేతిసంచులతో తన నిరసనను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఈ వినూత్న నిరసన ద్వారా జాతీయ, అంతర్జాతీయ అంశాలను ప్రతిబింబించాలని యత్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *