ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): నిజామాబాద్లో నిర్వహించిన పీఏసీ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇంచార్జీ మంత్రి సీతక్క, డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా అభివృద్ధి, పార్టీ బలోపేతంపై కీలక చర్చలు జరిగాయి.ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు చేరుతున్న సేవలపై సమీక్ష నిర్వహించారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించడం లక్ష్యంగా ముందుకు సాగాలని నాయకులు నిర్ణయించారు.ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు.
