మే 01, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఇటీవల జరిగిన వరుస ప్రమాదాల నేపథ్యంలో ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రవాణా శాఖ అధికారులు జీపీఎస్ ఆధారిత పర్యవేక్షణను ప్రారంభించారు. ఇకపై బస్సులు గంటకు 80 కిలోమీటర్లకు మించిన వేగంతో ప్రయాణించకూడదని స్పష్టం చేశారుఆలిండియా టూరిస్ట్ పర్మిట్ కింద నడిచే బస్సులపై ప్రత్యేక నిఘా పెట్టారు. రాష్ట్రంలో ఉన్న బస్సుల్లో ఎక్కువ భాగానికి ఇప్పటికే జీపీఎస్ పరికరాలు అమర్చగా, మిగిలిన వాటికీ త్వరలో అమలు చేయనున్నారు.కంట్రోల్ రూమ్ నుంచి బస్సుల ప్రయాణాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ, వేగ పరిమితి దాటితే వెంటనే అలర్ట్ అందే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన బస్సులను సీజ్ చేసి, ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లలో తనిఖీలు చేస్తున్నారు.ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నిబంధనలు పాటించని ట్రావెల్స్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
