Breaking News

ఆర్టీసీ కార్మికులకు అండగా ప్రభుత్వం.. సమస్యల పరిష్కారానికి చర్యలు: మంత్రి పొన్నం

మే 01, (నేటి తెలుగు పత్రిక): ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డిపోలో నిర్వహించిన మేడే కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. కార్మికుల సమస్యలపై చర్చలు జరిపి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు.కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించడంతో పాటు, కార్మికులకు 11 శాతం వేతన సవరణ ప్రకటించినట్లు వెల్లడించారు. త్వరలోనే సంఘాల ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.హైదరాబాద్‌లో కొత్త రూట్లలో బస్సులు నడుపుతూ ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరిచామని పేర్కొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో తాను వారధిగా ఉంటానని స్పష్టం చేశారు.సంస్థ అభివృద్ధి కోసం కార్మికులు ఐక్యంగా పనిచేయాలని సూచించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *