మే 01, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ గాంధీ భవన్లో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ లేబర్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి చైర్మన్ ప్రకాష్ గౌడ్ అధ్యక్షత వహించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరై జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా నిలుస్తుందని తెలిపారు. దేశ అభివృద్ధిలో కార్మికుల పాత్ర అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన కార్మికులకు “శ్రమ శక్తి” అవార్డులు ప్రదానం చేశారు. అవార్డులు అందుకున్న వారిని నాయకులు అభినందించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
