మే 01, (నేటి తెలుగు పత్రిక): గుంటూరులో శంకర్ విలాస్ సమీపంలో నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనులు త్వరలో వేగం అందుకోనున్నాయి. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ భూసేకరణ ప్రక్రియ జూలై నాటికి పూర్తవుతుందని తెలిపారు. మరో పది రోజుల్లో నిర్మాణ పనులు వేగవంతం అవుతాయని పేర్కొన్నారు.గుంటూరులో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి, ఇన్నర్ రింగ్ రోడ్డు మూడో దశ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం అభివృద్ధి పనులకు టెండర్లు పూర్తయ్యాయని చెప్పారు.నగరంలో పరిశుభ్రత మెరుగుపరచేందుకు 220 ఈ-ఆటోలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. వీటి ద్వారా చెత్త సేకరణ సులభతరం అవుతుందని చెప్పారు. డ్రైనేజీ పనులు మే నెలాఖరుకు పూర్తి అవుతాయని వివరించారు.అలాగే 22 పార్కుల అభివృద్ధికి రూ.7.2 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. పిల్లల కోసం ఆట వస్తువులు, జిమ్ పరికరాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.నగరంలో వీధి కుక్కల సమస్యపై ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి, ప్రతి నెల 125 కుక్కలకు శస్త్రచికిత్సలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
