హైదరాబాద్, మే 01, (నేటి తెలుగు పత్రిక): ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని పార్టీ జెండాతో పాటు కార్మిక జెండాను ఎగురవేశారు.ఈ సందర్భంగా కార్మికులు, కర్షకులకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికుల త్యాగాలు, సేవలను స్మరించుకుంటూ అమరవీరులకు నివాళులు అర్పించారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ జాగృతి నాయకులు పాల్గొన్నారు.
