Breaking News

టీఆర్‌ఎస్‌లోకి మాజీ మంత్రి బోడ జనార్దన్ ఎంట్రీకి రంగం సిద్ధం

హైదరాబాద్, మే 01, (నేటి తెలుగు పత్రిక): మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు బోడ జనార్దన్ తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్)లో చేరేందుకు సిద్ధమయ్యారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలోనే తన అనుచరులతో కలిసి అధికారికంగా పార్టీలో చేరనున్నట్లు బోడ జనార్దన్ తెలిపారు. సింగరేణి ప్రాంతంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.బోడ జనార్దన్ రాజకీయాల్లో అనుభవజ్ఞుడిగా గుర్తింపు పొందారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.ఈ పరిణామం టీఆర్‌ఎస్‌కు సింగరేణి ప్రాంతంలో బలం చేకూర్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *