Breaking News

కేసీఆర్, కాంగ్రెస్‌పై ధర్మపురి అర్వింద్ విమర్శలు

నిజామాబాద్‌, మే 03, (నేటి తెలుగు పత్రిక): ఎంపీ ధర్మపురి అర్వింద్ రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రతిపక్ష నేత కేసీఆర్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పరిపాలనలో లోపాలు ఉన్నాయని, ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని అన్నారు.ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో రూ.8 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. పసుపు రైతులకు మంచి మద్దతు ధర లభించడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని పేర్కొన్నారు.కేసీఆర్‌పై వ్యాఖ్యలు చేస్తూ, ఆయన శకం ముగిసిందని, తనతో ఉన్న నాయకులను మోసం చేయడం అలవాటైందని విమర్శించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో మత్తు పదార్థాల సరఫరా పెరిగిందని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పించిన అర్వింద్, పరిపాలనపై పట్టు లేదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారని ఆరోపించారు.ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని పేర్కొంటూ, రైతులు పండించిన ప్రతి గింజను వారం రోజుల్లోగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి పెద్దఎత్తున ఉద్యమం వస్తుందని హెచ్చరించారు.

కవిత పార్టీపై కేఏ పాల్ విమర్శలు

నక్సల్స్ తగ్గడంతో పోలీస్ వ్యూహం మార్పు.. గ్రేహౌండ్స్‌కు కొత్త బాధ్యతలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *