Breaking News

మహానాడును ఘనంగా నిర్వహిస్తాం: మంత్రి నారాయణ

నెల్లూరు, మే 04, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ మంత్రి పొంగూరు నారాయణ తెలుగుదేశం పార్టీ వార్షిక మహానాడును ఈసారి నెల్లూరు జిల్లాలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మహానాడును ఐఎఫ్కో సెజ్ ప్రాంతంలో నిర్వహించాలని నిర్ణయించామని వెల్లడించారు.సోమవారం నెల్లూరులో పర్యటించిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ, మహానాడు నిర్వహణకు సుమారు రెండు వేల ఎకరాల భూమి అందుబాటులో ఉందన్నారు. ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచే పనులు కొనసాగుతున్నాయని, ఈ నెల 6వ తేదీ నుంచి ఏర్పాట్లు వేగవంతం చేస్తామని చెప్పారు.మహానాడులో రాష్ట్రం మరియు ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోనున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ప్రజలకు పలు హామీలు కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది హాజరవుతారని అంచనా వేశారు.ట్రాఫిక్ మరియు ఇతర సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

కురుమ కుల సంఘం నాయకులు సమావేశం

ఒమన్‌లో చిక్కుకున్న మహిళకు అండగా ఏపీ ప్రభుత్వం: ముఖ్యమంత్రి చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *