Breaking News

మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనం: పీవీఎన్ మాధవ్

మే 04, (నేటి తెలుగు పత్రిక): విశాఖపట్నంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసాన్ని ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. ‘వికసిత భారత్’ లక్ష్యంతో దేశం ముందుకు సాగాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు.అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ లభించిందని, తమిళనాడులో హంగ్ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఓటు శాతం గణనీయంగా పెరిగిందని తెలిపారు.అభివృద్ధి, జాతీయ భద్రత, పారదర్శక పాలనకు ప్రజలు మద్దతు ఇచ్చారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి, డిజిటల్ పురోగతికి దేశవ్యాప్తంగా మంచి స్పందన వచ్చిందని పేర్కొన్నారు. యువత, మహిళలు, రైతులు, మధ్యతరగతి వర్గాల మద్దతే ఈ విజయానికి కీలకమని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటామని మాధవ్ స్పష్టం చేశారు.

బెంగాల్‌లో బీజేపీ విజయం చారిత్రాత్మకం: కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

ఎన్డీయే హవా.. ఏపీలో బీజేపీ సంబరాలు: మంత్రి సత్యకుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *