Breaking News

జవహర్‌నగర్ డంపింగ్ యార్డు తరలించాలి: సీఎం రేవంత్ రెడ్డికి జేఏసీ వినతి

మే 04, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ జవహర్‌నగర్ యాంటీ డంపింగ్ యార్డ్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిను కలిసి వినతిపత్రం సమర్పించారు. జవహర్‌నగర్ ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డును వెంటనే తరలించాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా లోక్‌సభ సభ్యుడు ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, యాంటీ డంపింగ్ యార్డ్ జేఏసీ చైర్మన్ డాక్టర్ బి. శంకర్ నారాయణ, స్థానిక నాయకులు తోటకూర వజ్రేష్ (జంగయ్య) యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.డంపింగ్ యార్డు కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని జేఏసీ ప్రతినిధులు సీఎంకు వివరించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, యార్డును ఇతర ప్రాంతానికి మార్చాలని వారు కోరారు.

రైతుల కోసం పోరాటం తీవ్రం… రేవంత్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాం: కేటీఆర్

ఉత్తర–దక్షిణ రాజకీయాలకు ప్రజల చెక్: బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *