మే 04, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ జవహర్నగర్ యాంటీ డంపింగ్ యార్డ్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిను కలిసి వినతిపత్రం సమర్పించారు. జవహర్నగర్ ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డును వెంటనే తరలించాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా లోక్సభ సభ్యుడు ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, యాంటీ డంపింగ్ యార్డ్ జేఏసీ చైర్మన్ డాక్టర్ బి. శంకర్ నారాయణ, స్థానిక నాయకులు తోటకూర వజ్రేష్ (జంగయ్య) యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.డంపింగ్ యార్డు కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని జేఏసీ ప్రతినిధులు సీఎంకు వివరించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, యార్డును ఇతర ప్రాంతానికి మార్చాలని వారు కోరారు.
