మే 04, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయి బీజేపీకి పట్టం కట్టారని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో అక్కడ అరాచకాలు, గుండాగిరి పెరిగాయని, వ్యవస్థలు దెబ్బతిన్నాయని ఆయన విమర్శించారు.డబుల్ ఇంజన్ ప్రభుత్వంగా బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడం హర్షణీయమని పేర్కొన్నారు. అక్రమ కోల్ మైనింగ్ ద్వారా వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని టీఎంసీపై ఆరోపణలు చేశారు. కోల్ బెల్ట్ ప్రాంతాల్లో బీజేపీ విజయం సాధించడం టీఎంసీకి గట్టి చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు.ప్రజలు మార్పు కోరుకుంటూ ఇచ్చిన తీర్పే ఈ ఫలితమని, అభివృద్ధి, పారదర్శక పాలన కోసం బీజేపీకి మద్దతు పెరుగుతోందని కిషన్ రెడ్డి తెలిపారు.
