మే 05, (నేటి తెలుగు పత్రిక): ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన మొక్కజొన్న పంట దహనం ఘటనపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. బోథ్ మండలం కనుగుట్టలో ప్రమాదవశాత్తు వంద ఎకరాలకు పైగా పంట దహనం కావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి బాధిత రైతులతో ఫోన్లో మాట్లాడిన కవిత, వారికి ధైర్యం చెప్పారు. మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, పార్టీ నాయకులు బానోత్ మౌనికతో కలిసి రైతుల పరిస్థితిని తెలుసుకున్నారు.పంట నష్టపోయిన రైతులు ఆత్మస్థైర్యంతో ఉండాలని సూచిస్తూ, వారి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులకు తక్షణ సాయం అందించాలని, పంట నష్టం అంచనా వేసి సరైన నష్టపరిహారం చెల్లించాలని కవిత డిమాండ్ చేశారు.
