Breaking News

ప్రతి గ్రామం స్వచ్ఛతకు మారుపేరుగా నిలపాలి: జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి

మచిలీపట్నం, మే 06,(నేటి తెలుగు పత్రిక): జిల్లాలోప్రతి గ్రామం స్వచ్ఛతకు మారుపేరుగా నిలిపేందుకు క్షేత్రస్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని డిపిఓ ధనలక్ష్మి పిలుపునిచ్చారు “స్వచ్ఛ పదం”కార్యక్రమo జిల్లా పంచాయతీ అధికారిణి ధనలక్ష్మి వేకువజామున మచిలీపట్నం పరిధిలోని పోతేపల్లి గ్రామంలో ప్రారంభించారు .ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాలు, మండలప్రధాన కేంద్రాలు, హైవేల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు.ప్రత్యేకంగా మండలం నుంచి వెళ్లే కనెక్టివిటీ రోడ్లు, ప్రతి పల్లెలోని ప్రధాన రహదారులు, హైవేలకు అనుసంధాన మార్గాలు శుభ్రంగాఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామం స్వచ్ఛతకు మారుపేరుగా నిలవాలని, పరిశుభ్రమైన వాతావరణం ప్రజల ఆరోగ్యానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు.ప్రతి బుధవారం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకుని “స్వచ్ఛ పదం” కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు సమన్వయంతో పనిచేసి పరిశుభ్రతను ప్రజా ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు.

వైసీపీపై మంత్రి డీబీవీ స్వామి విమర్శలు.. రాజకీయ విలువలు లేవని ఆరోపణ

రైల్వేజోన్‌పై క్రెడిట్ చోరీ ఆరోపణలు.. జగన్‌పై పల్లా శ్రీనివాసరావు ఫైర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *