Breaking News

కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ బూటకం: కేటీఆర్ తీవ్ర విమర్శలు

మే 06, (నేటి తెలుగు పత్రిక): వరంగల్‌లో జరిగిన ‘రైతు సంగ్రామ సదస్సు’లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన రైతు డిక్లరేషన్ పూర్తిగా బూటకమని, 34 హామీల్లో ఒక్కటీ అమలు కాలేదని ఆయన ఆరోపించారు.“రైతుల రక్తం తాగిన పార్టీ కాంగ్రెస్” అంటూ వ్యాఖ్యానించిన కేటీఆర్, రైతులు దొంగ హామీలను నమ్మి ఓటు వేశారని అన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ ఎక్కడ జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు. అలాగే రైతు కూలీలకు ఇచ్చిన రూ.12 వేలు సహాయం, పంట బీమా పథకం అమలు పరిస్థితిపై కూడా నిలదీశారు.అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వడం, రైతులకు ఇచ్చిన హామీల అమలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *