న్యూఢిల్లీ, మే 06, (నేటి తెలుగు పత్రిక): బీజేపీ ఎంపీలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటు చోరీ కారణంగా కొందరు గెలిచారని, అలాంటి వారిని గుర్తించడం కష్టమేమీ కాదని వ్యాఖ్యానించారు.“240 మంది బీజేపీ ఎంపీల్లో ప్రతి ఆరుగురిలో ఒకరు ఓటు చోరీ ద్వారా గెలిచినవారే” అని రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. “బీజేపీ భాషలో వారిని ‘చొరబాటుదారులు’ అని పిలవాలా?” అంటూ ప్రశ్నించారు.నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగి ఉంటే బీజేపీ 140 స్థానాలు కూడా గెలిచేది కాదని ఆయన ఆరోపించారు. అలాగే హరియాణాలో ఉన్న ప్రభుత్వం మొత్తం చొరబాటుదారుల ప్రభుత్వమేనని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
