Breaking News

Bareilly court notices to Asaduddin Owaisi

అసదుద్దీన్ ఒవైసీకి కోర్టు నోటీసులు

అసదుద్దీన్ ఒవైసీకి బరేలీ కోర్టు నోటీసులు

బరేలీ (ఉత్తర్ ప్రదేశ్): ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు మరియు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి బరేలీ కోర్టు నోటీసులు జారీ చేసింది. లోక్‌సభలో ప్రమాణస్వీకారం సందర్భంగా “జై పాలస్తీనా” అని నినదించడంపై న్యాయవాది వీరేంద్ర గుప్తా కోర్టును ఆశ్రయించారు.

గండ్రపల్లిలో మిస్టరీ డెత్స్.. భయంతో గ్రామం ఖాళీ!

పిటిషనర్ ఆరోపణల ప్రకారం, చట్టసభలో ఇలాంటి వ్యాఖ్యలు రాజ్యాంగం మరియు న్యాయ సూత్రాల ఉల్లంఘనగా పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒవైసీ చేసిన వ్యాఖ్యలు దేశ చట్టాలకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు.

ఈ కేసులో విచారణ చేపట్టిన కోర్టు, ఒవైసీ జనవరి 7న స్వయంగా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఈ విషయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

హేట్ స్పీచ్ బిల్లు కాదు.. “ఫ్రీ స్పీచ్‌పై ఆంక్షల బిల్లు” – హరీష్ రావు విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *