Breaking News

బెంగాల్‌లో చారిత్రక మలుపు – ప్రజలకు మోదీ కృతజ్ఞతలు, సువేందు అధికారి సీఎం ప్రమాణ స్వీకారం

మే 09, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక మార్పు చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంతో సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. వేలాది మంది బీజేపీ కార్యకర్తలు, ప్రజలు హాజరై వేడుకను ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభలో ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వేదికపై నుంచి ఆయన ప్రజలను అభివాదం చేసి, వారి తీర్పుకు గౌరవ సూచకంగా నమస్కరించారు. ఈ దృశ్యం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.గవర్నర్ ఆర్.ఎన్. రవి సువేందు అధికారితో పాటు మంత్రివర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు జాతీయ నేతలు హాజరయ్యారు.ఈ ఎన్నికల్లో మొత్తం 294 స్థానాల్లో బీజేపీ 207 సీట్లు గెలుచుకుని అధికారాన్ని సాధించింది. దశాబ్దాలుగా కొనసాగిన తృణమూల్ కాంగ్రెస్ పాలనకు ఈ ఫలితాలతో ముగింపు పలికినట్లైంది.ఈ విజయంతో బెంగాల్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ప్రారంభమయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కోసం తిరుమావళవన్‌ను కలవనున్న విజయ్

అతిపెద్ద పార్టీకే తొలి అవకాశం ఇవ్వాలి: చిదంబరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *