డిసెంబర్ 30న ఇస్రో స్పేడెక్స్ మిషన్కు శ్రీకారం
ఈ ఏడాదిలో చివరి అంతరిక్ష ప్రయోగంగా, ఇస్రో డిసెంబర్ 30న స్పేడెక్స్ మిషన్ను చేపట్టనుంది. ఈ ప్రయోగంలో 220 కేజీల బరువున్న రెండు ఉపగ్రహాలను భూ కక్షలోకి ప్రవేశపెట్టనుంది. ఉపగ్రహాలు భూమికి 470 కిలోమీటర్ల దూరంలో కక్ష్యలో ప్రవేశించనున్నాయి.
స్పేడెక్స్ మిషన్ విజయవంతం కావడం ఇస్రో భవిష్యత్ ప్రణాళికలకు ఎంతో కీలకమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రయోగం ద్వారా భారత్ అంతరిక్ష రంగంలో మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు
