మే 11, (నేటి తెలుగు పత్రిక): ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నాయి. దీంతో మిగిలిన నాలుగు నాకౌట్ స్థానాల కోసం ఎనిమిది జట్లు పోటీపడుతున్నాయి.ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు బలమైన స్థితిలో ఉన్నాయి. ఈ జట్లు మరో మ్యాచ్ గెలిస్తే దాదాపు ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది.పంజాబ్ కింగ్స్ కూడా మంచి అవకాశాల్లో ఉంది. మిగిలిన నాలుగు మ్యాచుల్లో రెండు విజయాలు సాధిస్తే నాకౌట్ దశకు చేరుకునే అవకాశాలు మెరుగవుతాయి.చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ప్రస్తుతం మధ్యస్థానాల్లో ఉండటంతో వీటి మిగిలిన మూడు మ్యాచులు కీలకంగా మారాయి. ప్రతి మ్యాచ్ ఇప్పుడు “డూ ఆర్ డై”గా మారింది.ఇక కోల్కతా నైట్రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. ఇకపై ఒక్క మ్యాచ్ ఓడినా ప్లేఆఫ్స్ ఆశలు దాదాపు ముగిసే పరిస్థితి నెలకొంది. దీంతో లీగ్ చివరి దశ మ్యాచ్లు మరింత ఉత్కంఠగా మారనున్నాయి.
