జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): ఐపీఎల్ 2026లో వరుసగా రెండోసారి టైటిల్ గెలిచిన ఆనందంలో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భావోద్వేగ పోస్ట్ చేశారు. గత సీజన్ విజయానంతరం “మనం మరోసారి కప్ గెలవగలమా?” అని జట్టు సభ్యులంతా తమను తాము ప్రశ్నించుకున్నామని, ఇప్పుడు వరుసగా రెండో ట్రోఫీతో ఆ కలను నిజం చేసుకున్నామని పేర్కొన్నారు.
ట్రోఫీతో కలిసి దిగిన విజయోత్సాహ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న కోహ్లీ, జట్టు కృషి, పట్టుదల, అభిమానుల మద్దతే ఈ విజయానికి కారణమని తెలిపారు. ఆయన చేసిన ఈ పోస్ట్కు అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది.
పోస్ట్ చేసిన గంట వ్యవధిలోనే 40 లక్షలకు పైగా లైక్స్, 1.7 లక్షలకు పైగా కామెంట్లు రావడం విశేషం. కోహ్లీ భావోద్వేగ సందేశం, ఆర్సీబీ వరుస విజయాల నేపథ్యంలో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అభిమానులు “కింగ్ కోహ్లీ”, “ఆర్సీబీ యుగం మొదలైంది” అంటూ అభినందనలు వెల్లువెత్తిస్తున్నారు.
