మే 11, (నేటి తెలుగు పత్రిక): కాకినాడలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. గాంధీనగర్లోని రెడ్క్రాస్ భవనం సమీపంలో జి. నాగేశ్వరరావు అనే కానిస్టేబుల్ను గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా హత్య చేశారు. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న నాగేశ్వరరావు మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్, ఫింగర్ప్రింట్ నిపుణులు ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించారు. పాత కక్షలు, వ్యక్తిగత విభేదాలు, విధులకు సంబంధించిన అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. ఈ ఘటనతో నగరంలో భయాందోళనలు నెలకొన్నాయి.
